Thursday, May 28, 2026

Date: 2026-05-28
అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రి వైద్యులు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. గుండె రక్తనాళాల్లో తీవ్రంగా కాల్షియం పేరుకుపోయి, 90% అడ్డంకులతో (కాల్షియం స్కోర్ 510) ప్రాణాపాయ స్థితిలో వచ్చిన 65 ఏళ్ల వృద్ధుడికి అత్యాధునిక ఇన్ వాస్క్యులర్ లిథోట్రిప్సీ (IVL) విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు.
Dr. Moode Sandeep, Senior Consultant Interventional Cardiologist, నేతృత్వంలో ఈ క్లిష్టమైన ప్రక్రియ విజయవంతమైంది.
💡ఈ ఐవిఎల్ (IVL) ప్రత్యేకత:
• షాక్వేవ్ టెక్నాలజీ: కిడ్నీ రాళ్లను కరిగించే టెక్నాలజీ ఆధారంగా, గుండె ధమనుల లోతుల్లో పేరుకుపోయిన గట్టి కాల్షియం పొరలను షాక్వేవ్స్తో సురక్షితంగా పగులగొడతారు.
• సురక్షితమైనది: సాంప్రదాయ రొటేషనల్ అథెరెక్టమీ పద్ధతితో పోలిస్తే ఇందులో వేడి ఉత్పత్తి కాదు, రక్తనాళాలకు హాని జరిగే ప్రమాదం చాలా తక్కువ.
• ఖచ్చితమైన ఇమేజింగ్: OCT (ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ) టెక్నాలజీ సహాయంతో కాల్షియం ఎంత లోతులో ఉందో ఖచ్చితంగా గుర్తించి, అత్యంత సురక్షితంగా స్టెంట్ అమర్చారు.
సరికొత్త వైద్య సాంకేతికతలను ప్రాంతీయ ప్రజలకు అందిస్తూ, ప్రపంచ స్థాయి హృద్రోగ చికిత్సకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది కిమ్స్ సవీర ఆసుపత్రి!